Kurnool: ఆదోనిలో నో పెన్షన్స్.. నీళ్లలోనే పడిగాపులు

ABN , First Publish Date - 2022-08-04T02:11:13+05:30 IST

మున్సిపల్ కార్యాలయం ముందు పింఛన్ల (pensions) కోసం వృద్ధులు, వితంతువులు పడిగాపులు కాశారు. పెన్షన్ కావాలంటే....

Kurnool: ఆదోనిలో నో పెన్షన్స్.. నీళ్లలోనే పడిగాపులు

కర్నూలు (Kurnool): ఆదోని (Adoni) మున్సిపల్ కార్యాలయం ముందు పింఛన్ల (pensions) కోసం వృద్ధులు, వితంతువులు పడిగాపులు కాశారు. పెన్షన్ కావాలంటే ఉదయమే రావాలని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో అక్కడే ఉండిపోయారు. భారీ వర్షంతో మున్సిపల్ ముందు నీరు నిలిచిపోయింది. దీంతో కూర్చోవడానికి స్థలం లేక నీళ్లలోనే ఉన్నారు. ఉదయం నుంచి వృద్ధులు పడిగాపులు కాస్తున్నా.. కూర్చోవడానికి చైర్లు లేకపోయినా..అధికారులు మాత్రం  ఏమాత్రం పట్టించుకోలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి (Mla Sai Prasad Reddy) వచ్చే వరకు పింఛన్లు ఇవ్వడానికి కుదరదని చెప్పేశారు. చేసేదేమీ లేక వర్షంలోనే పింఛన్ల కోసం వృద్ధులు చూశారు. పింఛన్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో పడిగాపులు కాశామని.. కానీ అధికారులు మాత్రం పింఛన్ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-08-04T02:11:13+05:30 IST