పలువురికి ఎమ్మెల్యే గొట్టిపాటి పరామర్శ

ABN , First Publish Date - 2021-03-01T05:33:47+05:30 IST

ఇటీవల అనారోగ్యం తో మృతిచెందిన ప లువురి కుటుంబ స భ్యులను అద్దంకి శా సన సభ్యులు గొట్టిపా టి రవికుమార్‌ ఆది వారం పరామర్శించా రు.

పలువురికి ఎమ్మెల్యే గొట్టిపాటి పరామర్శ
దైవాలరావూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

మేదరమెట్ల , ఫిబ్రవరి 28: : ఇటీవల అనారోగ్యం తో మృతిచెందిన ప లువురి కుటుంబ స భ్యులను అద్దంకి శా సన సభ్యులు గొట్టిపా టి రవికుమార్‌ ఆది వారం పరామర్శించా రు. దైవాలరావూరు కు చెందిన గుండ ప నేని సుబ్బారా యు డు, వృద్ధాప్యంతో మృ తి చెందగా, ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అ నంతరం కొలచనకోట అంజయ్య, భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో అంగలకుర్తి చిరంజీవి కుమార్తె మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవికుమార్‌ పరామర్శిం చారు. అలాగే మేదరమెట్లలో తన్నీరు సుబ్బారావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఈక్రమంలో దైవాలరావూరు గ్రామంలో టీడీపీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, వాటి పరిస్థితులు గురించి కాసేపు చర్చి ంచారు. ఆయన వెంట నాయకులు చెన్నుపాటి హరిబాబు, ఆళ్ల హనుమం తరావు, ముమ్మన నరసింహారావు, కోనూరి చంద్రశేఖర్‌, వజ్జా వేణు, గుండప నేని ఆనంద్‌, ముమ్మన సుబ్బారావు తదితరులు ఉన్నారు.



Updated Date - 2021-03-01T05:33:47+05:30 IST