ఎడ్సెట్ ప్రశ్న పత్రం విధానంలో మార్పు
ABN , First Publish Date - 2021-02-28T11:50:28+05:30 IST
ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం విధానం మారింది. కంప్యూటర్ విద్యకు సంబంధించిన అంశాలను చేరుస్తూ టెస్ట్ కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ ఉన్నత విద్యామండలి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం విధానం మారింది. కంప్యూటర్ విద్యకు సంబంధించిన అంశాలను చేరుస్తూ టెస్ట్ కమిటీ చేసిన సిఫారసులను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ఆమోదించింది. మొత్తం 150 మార్కులకుగాను 10వ తరగతి సిలబస్ నుంచి గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం నుంచి 20 చొప్పున మొత్తం 60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ 20, ఆంగ్లం 20, జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూ్సకు 30, కంప్యూటర్ అవగాహనకు 20 మార్కులు ఉంటాయి. వచ్చే నెల 28న ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, మే 5 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య పాపిరెడ్డి తెలిపారు. పరీక్ష ఆగస్టులో ఉంటుందని, తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.