12 ఏళ్ల అనంతరం మదురై-తేని రైలు సేవలు

ABN , First Publish Date - 2022-05-28T16:09:38+05:30 IST

మదురై-తేని జిల్లాల మధ్య 12 ఏళ్ల అనంతరం శుక్రవారం నుంచి రైలు సేవలు ప్రారంభం కావడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. మదురై రైల్వే జంక్షన్‌లో బయల్దేరిన

12 ఏళ్ల అనంతరం మదురై-తేని రైలు సేవలు

ప్యారీస్‌(చెన్నై): మదురై-తేని జిల్లాల మధ్య 12 ఏళ్ల అనంతరం శుక్రవారం నుంచి రైలు సేవలు ప్రారంభం కావడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. మదురై రైల్వే జంక్షన్‌లో బయల్దేరిన రైలును పూలతో అలంకరించి, ప్రయాణం సాఫీగా కొనసాగాలని కాంక్షిస్తూ రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదురై-తేని రైల్వేస్టేషన్ల మధ్య మీటర్‌ గేజ్‌ మార్గాన్ని బ్రాడ్‌ గేజ్‌గా మార్చే పనులు పూర్తయ్యాయి. ఈ కొత్త బ్రాడ్‌ గేజ్‌ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం చెన్నై నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, మదురై-తేని రైలు తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ బ్రాడ్‌ గేజ్‌ రైలు మార్గం పథకం కోసం మార్చి 31వ తేది వరకు రూ.446 కోట్లు వెచ్చించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-05-28T16:09:38+05:30 IST