పెళ్లైన 20 రోజులకు సంచలన విషయం బయటపెట్టిన నవవధువు.. పోలీస్ స్టేషన్కు పరుగులు తీసిన వరుడు
ABN , First Publish Date - 2022-02-14T01:09:47+05:30 IST
పెళ్లైన 20 రోజులకే వరుడి ముఖంలో సంతోషం మాయమైంది. నవవధువు చెప్పిన మాటలకు అతడి మైండ్
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన 20 రోజులకే వరుడి ముఖంలో సంతోషం మాయమైంది. నవవధువు చెప్పిన మాటలకు అతడి మైండ్ బ్లాంక్ అయింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించిన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని బార్మర్ ప్రాంతానికి చెందిన మెహ్రమ్కు కొద్ది రోజుల క్రితమే గుజరాత్కు చెందిన మమతతో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత దాదాపు 20 రోజులకు మెహ్రమ్.. ఉదయాన్నే కూలీ పనులకు వెళ్లాడు. సాయంత్రం అయ్యే సరికి పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో తన భార్య కనిపించకపోవడంతో.. చుట్టుపక్కల వెతికి చూశాడు. అయినా మెహ్రమ్కు మమత జాడ తెలీలేదు. దీంతో ఎక్కెడికెళ్లిందో తెలిసుకునేందుకు అతడు మమతకు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో సంచలన విషయాన్ని మమత బయటపెట్టింది. తనకు ఇదివరకే పెళ్లైందని.. ఓ పాప కూడా ఉందని చెప్పడంతో మెహ్రమ్ ఒక్కసారిగా షాకయ్యాడు.
అనంతరం ఇంట్లోకి వెళ్లి తన గదిని పరిశీలించాడు. ఇంట్లోంచి మమత రూ.5లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు గ్రహించాడు. తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి, మమతపై ఫిర్యాదు చేశాడు. మధ్యవర్తి ద్వారా మమతను తాను పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించాడు. ఈ పెళ్లి జరిపించినందుకుగాను ఆ మధ్యవర్తికి సుమారు రూ.3లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఎస్పీ స్థానిక అధికారులకు ఈ కేసును బదిలీ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కోత్వాలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. రాజస్థాన్, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఈ మధ్య తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.