అతడికి ఇది మూడో పెళ్లి.. మళ్లీ మరో యువతితో భర్త ప్రేమాయణం.. ఆ ఇంట్లో అర్ధరాత్రి జరిగిందో దారుణం..!
ABN , First Publish Date - 2022-04-20T22:32:03+05:30 IST
అతడికి అప్పటికి మూడు పెళ్లిళ్లు జరిగాయి.. అవి చాలవన్నట్టు అతను మరో మహిళతో ప్రేమలో పడ్డాడు..
అతడికి అప్పటికి మూడు పెళ్లిళ్లు జరిగాయి.. అవి చాలవన్నట్టు అతను మరో మహిళతో ప్రేమలో పడ్డాడు.. ఆమెను తరచుగా కలిసేవాడు.. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. ఆ విషయం మూడో భార్యకు తెలిసింది.. ఆమను కలవొద్దని, ఆమెతో పెళ్లి వద్దని ఎన్నో సార్లు నచ్చ చెప్పింది.. అయినా అతను వినలేదు.. దీంతో రాయితో తలపై కొట్టి చంపేసింది.
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు సమీపంలోని సరోరా బస్తీలో నివసిస్తున్న ఉమేష్ కుమార్ ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి ఇంగ్లేశ్వరి అనే మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి బస్తీలో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మరో యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయం ఇంగ్లేశ్వరికి తెలిసింది. మరో పెళ్లి వద్దని భర్తను బతిమాలింది.
భార్య మాటలను ఉమేష్ పట్టించుకోలేదు. ఈ నెల 17వ తేదీ రాత్రి కూడా తన ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ భార్యకు కనిపించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ క్రమంలో ఓ పెద్ద రాయి తీసుకుని భర్త తలపై కొట్టింది. దెబ్బ బలంగా తగలడంతో ఉమేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
ధుర్వే అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉన్నాడని ఉర్ల పోలీస్ స్టేషన్ బృందానికి సమాచారం అందింది. విచారణలో మృతుడి శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి యజమానిని, చుట్టుపక్కల వారిని పోలీసు బృందం సభ్యులు ప్రశ్నించారు. మృతుడు ఉమేష్ కుమార్ ధుర్వే తండ్రి చైన్ సింగ్ ధుర్వే వయస్సు 30 సంవత్సరాలు బిలైఖర్ పోలీస్ స్టేషన్ బజాక్ జిల్లా దండోరి (మధ్యప్రదేశ్) నివాసి తన భార్య ఇంగ్లేశ్వరి ధుర్వేతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.