పెళ్లయిన కొద్ది రోజులకే భర్త గురించి తెలిసిందో షాకింగ్ నిజం.. అసలు విషయాన్ని అత్తకు చెప్పిన కోడలు.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-07-18T21:29:23+05:30 IST

ఆమెకు మూడేళ్ల కిందట వివాహమైంది.. ఆమె తల్లిదండ్రులు రూ.25 లక్షలు కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు..

పెళ్లయిన కొద్ది రోజులకే భర్త గురించి తెలిసిందో షాకింగ్ నిజం.. అసలు విషయాన్ని అత్తకు చెప్పిన కోడలు.. ఆ తర్వాత..

ఆమెకు మూడేళ్ల కిందట వివాహమైంది.. ఆమె తల్లిదండ్రులు రూ.25 లక్షలు కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు.. అయితే వివాహం జరిగి ఎన్ని రోజులవుతున్నా భర్త ఆమె దగ్గరకు వెళ్లడం లేదు.. ప్రతిసారి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు.. మూడేళ్లలో ఒక్కసారి కూడా వారిద్దరూ శారీరకంగా దగ్గరవలేదు.. ఆ విషయాన్ని ఆమె తన అత్తయ్యకు చెప్పింది.. తన కొడుకు శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు కోడలికి అత్తయ్య చెప్పింది.. ఆ విషయం ఎవరకీ చెప్పవద్దని బెదిరించింది.. తన లోపాన్ని కప్పి పుచ్చుకునేందుకు భార్యను భర్త కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు.. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఇది కూడా చదవండి..

వరద పరిస్థితిని చూడడానికి రోడ్డుపైకి వచ్చిన కలెక్టర్.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..


Indoreకు చెందిన బాధిత మహిళ 2019లో ముంబైకి చెందిన ప్రీతేష్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో మహిళ తల్లిదండ్రులు ప్రీతేష్‌కు రూ.25 లక్షలు కట్నంగా ఇచ్చారు. పెళ్లి జరిగిన తర్వాత ప్రీతేష్ వ్యవహారం ఆమెకు అనుమానాస్పదంగా అనిపించింది. భార్యను ప్రీతేష్ దగ్గరకు రానిచ్చేవాడు. ఆమె చొరవ చూపితే తిట్టి దూరంగా నెట్టేసేవాడు. అత్తయ్యకు చెచితే తన కొడుకు శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు చెప్పింది. త్వరలోనే కోలుకుంటాడని చెప్పింది. అయితే మూడేళ్లు దాటుతున్నా ప్రీతేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆమె భర్తను, అత్తమామలను నిలదీసింది. 


తన లోపాన్ని కప్పి పుచ్చుకునేందుకు భార్యను ప్రీతేష్ కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. రూ.20 లక్షల కట్నం కావాలని డిమాండ్ చేసేవాడు. కట్నం తీసుకు రావాలని చెప్పి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. పుట్టింటికి చేరుకున్న బాధిత యువతి తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పింది. వారందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


Updated Date - 2022-07-18T21:29:23+05:30 IST