పెళ్లయి మూడ్రోజులు కూడా కాకముందే.. జైలు పాలైన కొత్త పెళ్లికూతురు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-13T22:35:44+05:30 IST

ఆ మహిళకు నెల రోజుల కిందట వివాహం జరిగింది.. వివాహం జరిగిన తర్వాత మూడ్రోజులు అత్తగారింట్లో బాగానే తిరిగింది..

పెళ్లయి మూడ్రోజులు కూడా కాకముందే.. జైలు పాలైన కొత్త పెళ్లికూతురు.. అసలేం జరిగిందంటే..

ఆ మహిళకు నెల రోజుల కిందట వివాహం జరిగింది.. వివాహం జరిగిన తర్వాత రెండ్రోజులు అత్తగారింట్లో బాగానే తిరిగింది.. మూడో రోజు అత్త మామలకు పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చింది.. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఇంట్లోని రూ.లక్షల విలువైన బంగారం, నగలు తీసుకుని పరారైంది.. దీంతో వరుడి తరఫు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు తాజాగా ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన సచిన్ తివారీ అనే వ్యక్తి గత నెల 19వ తేదీన మహారాష్ట్రకు చెందిన నికిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రెండ్రోజులు ఆ మహిళ బాగానే ఉంది. మూడో రోజు ఉదయం అత్తమామలకు పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చి తాగించింది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఇంట్లో ఉన్న బంగారం, నగలు తీసుకుని పరారైంది. కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన సచిన్ జరిగిన విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు నికిత కోసం అన్వేషణ సాగించారు. నికితను సచిన్‌కు పరిచయం చేసిన మధ్యవర్తులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా నికిత సమాచారం సేకరించారు. ఆ విషయం తెలుసుకున్న నికిత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2022-04-13T22:35:44+05:30 IST