అప్పుడు కోహ్లీ, సచిన్.. ఇప్పుడు వీళ్ల సెంచరీలు.. సీఎం వెటకారం!

ABN , First Publish Date - 2021-03-01T11:29:58+05:30 IST

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విమర్శలు చేశారు. కోహ్లీ, సచిన్ సెంచరీలు కొట్టడం చూసిన తర్వాత ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు కొట్టడం చూస్తున్నామంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వెటకారమాడారు.

అప్పుడు కోహ్లీ, సచిన్.. ఇప్పుడు వీళ్ల సెంచరీలు.. సీఎం వెటకారం!

ముంబై: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే విమర్శలు చేశారు. కోహ్లీ, సచిన్ సెంచరీలు కొట్టడం చూసిన తర్వాత ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సెంచరీలు కొట్టడం చూస్తున్నామంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వెటకారమాడారు. ‘‘పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి.  విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ల సెంచరీలు మనం చూశాం. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ కొట్టే సెంచరీలు చూస్తున్నాం’’ అని ఉద్ధవ్ అన్నారు. ముంబైలో పెట్రోలు ధర 97.57 రూపాయలకు చేరింది. డీజిలు ధర రూ.88.60గా ఉంది. ఈ క్రమంలోనే ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2021-03-01T11:29:58+05:30 IST