భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. దీంతో ఆ భర్త ఆమె చెల్లిని కిడ్నాప్ చేసి..

ABN , First Publish Date - 2021-12-27T22:25:21+05:30 IST

అతనికి రెండేళ్ల క్రితం వివాహమైంది.. అయితే అతనికున్న మద్యం వ్యసనం కారణంగా భార్యతో తరచుగా గొడవలు అవుతుండేవి..

భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. దీంతో ఆ భర్త ఆమె చెల్లిని కిడ్నాప్ చేసి..

అతనికి రెండేళ్ల క్రితం వివాహమైంది.. అయితే అతనికున్న మద్యం వ్యసనం కారణంగా భార్యతో తరచుగా గొడవలు అవుతుండేవి.. నాలుగు నెలల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. దీంతో ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు.. కాలేజీలో చదువుకుంటున్న ఆమె చెల్లిని కిడ్నాప్ చేశాడు.. ఆమెను తన గ్రామానికి తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు అత్యాచారం చేశాడు.. రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


కోటాలో నివాసం ఉంటున్న నిందితుడికి అతడి భార్యతో తరచుగా గొడవలు అవుతుండేవి. రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తుండడంతో అతని భార్య భరించలేకపోయింది. నెలన్నర క్రితం అతడిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెకు బుద్ధి చెప్పాలని నిందితుడు ఓ పథకం వేశాడు. ఆమె 17 ఏళ్ల చెల్లి చదువుకుంటున్న కాలేజీకి వెళ్లి మాయ మాటలు చెప్పి ఆమెను తన గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 


సాయంత్రం కాలేజీ నుంచి ఆ బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తర్వాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అల్లుడిపైనే అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండ్రోజుల పాటు అతడి గురించి గాలించి చివరకు పట్టుకున్నారు. బాలిక స్టేట్‌మెంట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-12-27T22:25:21+05:30 IST