రెండేళ్ల అనంతరం రామేశ్వరం-మదురై రైలు సేవలు
ABN , First Publish Date - 2022-06-23T15:10:30+05:30 IST
రామేశ్వరం-మదురై మధ్య ప్యాసింజర్ రైలు సేవలు రెండేళ్ల అనంతరం బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిలిపివేసిన
పెరంబూర్(చెన్నై), జూన్ 22: రామేశ్వరం-మదురై మధ్య ప్యాసింజర్ రైలు సేవలు రెండేళ్ల అనంతరం బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా గత రెండేళ్లుగా నిలిపివేసిన రైలు సేవలను క్రమక్రమంగా ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో, రెండేళ్లుగా నిలిపివేసిన రామేశ్వరం-మదురై ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరిన రైలు పాంబన్ వంతెన మీదుగా మదురై వెళ్లింది. అలాగే, మదురై నుంచి రామేశ్వరం రైలు కూడా బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు.