ముస్లింలను మోసం చేసిన జగన్‌

ABN , First Publish Date - 2022-06-25T06:19:20+05:30 IST

ముస్లి మైనార్టీలను విస్మరిస్తున్న సీఎం జగన్‌రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ కరిముల్లా అన్నారు.

ముస్లింలను మోసం చేసిన జగన్‌
జగన్‌ బుద్ధి మారాలని దర్గాలో టీడీపీ మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం), జూన్‌ 24: ముస్లి మైనార్టీలను  విస్మరిస్తున్న సీఎం జగన్‌రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు షేక్‌ కరిముల్లా అన్నారు. జిల్లా మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు ఎం.డి.అప్సర్‌ ఆధ్వర్యంలో హజరత్‌ సయ్యద్‌ షాబుఖారీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరిముల్లా మాట్లాడుతూ ముస్లింలపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందన్నారు. ఆడపిల్లల దుల్హన్‌ పథకం రద్దు చేయటం దారుణమన్నారు. జిల్లా మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ఎం.డి.అప్సర్‌ మాట్లాడుతూ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటనలు ఈ ప్రభుత్వ అసమర్థత వలన చోటుచేసుకుందని అన్నారు.  మైనార్టీ సెల్‌ నాయకులు షేక్‌ గోరే, మహబూబ్‌ సుభాని, నాగుల్‌ మీరా, ఖాజా, సయ్యద్‌ పర్హాన్‌, గోరేబాషా, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T06:19:20+05:30 IST