ముస్లింలను మోసం చేసిన జగన్
ABN , First Publish Date - 2022-06-25T06:19:20+05:30 IST
ముస్లి మైనార్టీలను విస్మరిస్తున్న సీఎం జగన్రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ కరిముల్లా అన్నారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం), జూన్ 24: ముస్లి మైనార్టీలను విస్మరిస్తున్న సీఎం జగన్రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ కరిముల్లా అన్నారు. జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎం.డి.అప్సర్ ఆధ్వర్యంలో హజరత్ సయ్యద్ షాబుఖారీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరిముల్లా మాట్లాడుతూ ముస్లింలపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందన్నారు. ఆడపిల్లల దుల్హన్ పథకం రద్దు చేయటం దారుణమన్నారు. జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎం.డి.అప్సర్ మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటనలు ఈ ప్రభుత్వ అసమర్థత వలన చోటుచేసుకుందని అన్నారు. మైనార్టీ సెల్ నాయకులు షేక్ గోరే, మహబూబ్ సుభాని, నాగుల్ మీరా, ఖాజా, సయ్యద్ పర్హాన్, గోరేబాషా, తదితరులు పాల్గొన్నారు.