భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దే నూతన విద్యా విధానం
ABN , First Publish Date - 2020-11-30T04:54:40+05:30 IST
భారత్ను విశ్వ గురువుగా తీర్చిదిద్దే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఏజీసీటీఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్దా చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఏజీసీటీఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్
సింహాచలం, నవంబరు 29: భారత్ను విశ్వ గురువుగా తీర్చిదిద్దే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఏజీసీటీఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్దా చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లా విశ్వహిందూ పరిషత్ సహాయ కార్యదర్శి పూడిపెద్ది శర్మతో కలిసి ఆదివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం-2020 కింద సమూల మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మనదేశానికి చెందిన ఉపాధ్యాయులు, నర్సులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అనుకూలమైన కోర్సుల రూపకల్పనకు, ఆధునిక సాంకేతికతను వినియోగించి పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామన్నారు.