72 ఏళ్ల భర్తను చంపేసిన మహిళ.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అల్లుడితో కలిసి ఎలాంటి స్కెచ్ వేసిందంటే..

ABN , First Publish Date - 2022-04-21T08:57:16+05:30 IST

అతను తాగి వచ్చి రోజూ భార్యతో గొడవపడేవాడు.. తరచుగా ఆమెను కొట్టేవాడు.. గత నెలలో కూడా అలాగే భార్యపై చేయి చేసుకున్నాడు. ఒకరోజు జరిగిన గొడవలో అతను ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణించాడని తెలిసి షాకైన భార్య.. భర్త మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. అందుకు కూతురు, అల్లుడితో కలిసి పథకం...

72 ఏళ్ల భర్తను చంపేసిన మహిళ.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అల్లుడితో కలిసి ఎలాంటి స్కెచ్ వేసిందంటే..

అతను తాగి వచ్చి రోజూ భార్యతో గొడవపడేవాడు.. తరచుగా ఆమెను కొట్టేవాడు.. గత నెలలో కూడా అలాగే భార్యపై చేయి చేసుకున్నాడు. ఒకరోజు జరిగిన గొడవలో అతను ప్రాణాలు కోల్పోయాడు. భర్త మరణించాడని తెలిసి షాకైన భార్య.. భర్త మృతదేహాన్ని మాయం చేయాలనుకుంది. అందుకు కూతురు, అల్లుడితో కలిసి పథకం వేసింది. భర్త మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి నగరానికి దూరంగా తీసుకెళ్లి నిప్పుపెట్టింది. కానీ ఆమె చేసిన చిన్న తప్పు వల్ల పోలీసులకు దొరికిపోయింది.


ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ పోలీసులకు సగం కాలిన మృతదేహం గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. వీడియోలో ఉన్న కారు నెంబర్ ఆధారంగా ఒక్కో క్లూ సంపాదిస్తూ ఆ మృతదేహం ముంబైకి చెందిన సంపత్ లాల్ మిశ్రాది అని తెలుసుకున్నారు. అనంతరం అతని అడ్రస్ సంపాదించి నేరుగా ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసి షాకైన సంపత్ భార్య రాజకుమారి నిజం అంగీకరించింది. 


భర్త రోజూ తాగి వచ్చి తనను కొట్టేవాడని, ఘటన జరిగిన రోజు రాత్రి కూడా తనను కొట్టాడని, అడ్డుకునే క్రమంలో అతడిని తోశానని, మంచానికి తల కొట్టుకోవడంతో చనిపోయాడని రాజకుమారి పోలీసులకు చెప్పింది. ఆ తరువాత శవాన్ని సూట్‌కేసులో పెట్టి కూతురు, అల్లుడి సహాయంతో ముంబై నుంచి 600 కి.మి. దూరంలో ఉన్న ఇండోర్ వెళ్లింది.. అక్కడ పొలాల్లో భర్త మృతదేహానికి నిప్పంటించింది.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజకుమారిని, మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన ఆమె కూతురు, అల్లుడిని అరెస్ట్ చేశారు. 


Updated Date - 2022-04-21T08:57:16+05:30 IST