మురుగునీరు పోవడం లేదని ఆందోళన
ABN , First Publish Date - 2022-07-01T04:33:40+05:30 IST
తమ కాలనీలో మురుగునీరు పోయే వీలులేక ఎక్కడ మురుగు అక్కడే ఉందంటూ కేఆర్పురం దళితకాలనీ మహిళలు గురువారం ఆందోళన చేశారు.
మనుబోలు, జూన్30: తమ కాలనీలో మురుగునీరు పోయే వీలులేక ఎక్కడ మురుగు అక్కడే ఉందంటూ కేఆర్పురం దళితకాలనీ మహిళలు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలనీలో మురుగుకాలువలు కొత్తగా కట్టినారన్నారు. ఇళ్లలోంచి వచ్చే నీరు కాలువల్లోనే నిలిచిపోతోందన్నారు. నెలల తరబడి పంచాయతీ సిబ్బంది కాలువలు తీసేందుకు రావడం లేదన్నారు. దీంతో కాలువలు నిండి మురుగునీరు ఇళ్లలోకి వస్తోందన్నారు. వచ్చేది వర్షాకాలం. మరోపక్క దోమలు విపరీతంగా ఉన్నాయి. వీటి వల్ల బిడ్డలకు రోగాలు వస్తాయని భయమేస్తోందన్నారు. అధికారులు తమ కాలనీకి వచ్చి మురుగుకాలువల పరిస్థితి చూడాలన్నారు. నిల్వఉన్న మురుగునీటిని తొలగించి దోమలు లేకుండా చేయాలని కోరారు.