కాంగ్రెస్తోనే రైతురాజ్యం సాధ్యం
ABN , First Publish Date - 2022-05-26T05:49:23+05:30 IST
కాంగ్రెస్తోనే తెలంగాణలో రైతురాజ్యం సాధ్యమవుతుందని డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ అన్నారు.
- డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్
వీర్నపల్లి, మే 25: కాంగ్రెస్తోనే తెలంగాణలో రైతురాజ్యం సాధ్యమవుతుందని డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ అన్నారు. వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో బుధవారం రైతు డిక్లరేషన్పై రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ పాలన రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. అన్నం పెట్టే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవకుండా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేస్తామని మోసగించారన్నారు. రైతులను రాజులుగా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. గ్రామాల్లో గడప గడపకు కరపత్రాలను అందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొంగు తిరుపతి, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కె గౌస్, బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు వ్రీనివఆస్, సంతోష్, రాములు, శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.