యూరియా ఎక్కువరేటుకు అమ్మితే చర్యలు
ABN , First Publish Date - 2022-01-19T06:02:26+05:30 IST
యూరియా ఎక్కువ ధరకు అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొంటామని వ్యవసాయశాఖ జేడీ విజయభారతి హెచ్చరించారు.
డీలర్ల సమావేశంలో జేడీ విజయభారతి హెచ్చరిక
గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): యూరియా ఎక్కువ ధరకు అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొంటామని వ్యవసాయశాఖ జేడీ విజయభారతి హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో మంగళవారం ‘యూరియా వారి దయ’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్పందించిన జేడీ ఎరువుల కంపెనీ ప్రతినిధులతో జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, నెలాఖరకు 22 వేల మెట్రిక్ టన్నులు వస్తుందన్నారు. మార్క్ఫెడ్ వద్ద 7,500 మెట్రిక్ టన్నులు ఉందని, ఆర్ఎఫ్సీఎల్ కంపెనీ బుధవారం 2,600 మెట్రిక్ టన్నులు విడుదల చేస్తుందన్నారు. ఆర్బీకేలలో నిల్వలు పెంచుతామన్నారు. రైతులకు యూరియా సకాలంలో ప్రభుత్వ ధరలకు అమ్మే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీడీలు రామాంజనేయులు, మురళి, ఏడీలు హేమలత, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.