Karimnagar: జమ్మికుంటలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-05-18T15:55:38+05:30 IST
జమ్మికుంటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.Vegetable Marketను తరలించవద్దంటూ వ్యాపారుల ధర్నాకు
కరీంనగర్: జమ్మికుంటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.Vegetable Marketను తరలించవద్దంటూ వ్యాపారుల ధర్నాకు దిగారు. బలవంతంగా మార్కెట్ను తరలిస్తున్నారంటూ వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. పాత వ్యవసాయ మార్కెట్ తరలింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా వినకుండా తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల ధర్నాకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు మద్ధతు తెలిపారు. ఇటీవలే వ్యాపారుల కోసం రూ.కోటిన్నరతో నూతన మార్కెట్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. అయినా పాత కూరగాయల మార్కెట్ను తొలగించవద్దని వ్యాపారులు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.