పత్తికొండకు నేడు పీసీసీ అధ్యక్షుడి రాక

ABN , First Publish Date - 2020-09-27T08:34:19+05:30 IST

పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పత్తికొండకు రానున్నారని డీసీసీ అధ్యక్షుడు అహ్మద్‌ ఆలీఖాన్‌ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం....

పత్తికొండకు నేడు పీసీసీ అధ్యక్షుడి రాక

కర్నూలు(అర్బన్‌), సెప్టెంబరు: పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పత్తికొండకు రానున్నారని డీసీసీ అధ్యక్షుడు అహ్మద్‌ ఆలీఖాన్‌ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు పంచలింగాల టోల్‌గేట్‌ వద్దకు కాంగ్రెస్‌ నాయకులు చేరుకోవాలని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన పత్తికొండకు 2 గంటలకు చేరుకుంటారని తెలిపారు. పత్తికొండలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోయ క్రాంతి నాయుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. అనంతరం అక్కడ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారన్నారు. నంద్యాల పార్లమెంట్‌ డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొంటారన్నారు. 

Updated Date - 2020-09-27T08:34:19+05:30 IST