ఎయిడెడ్ టీచర్లకు టెట్ అక్కర్లేదు!
ABN , First Publish Date - 2022-06-28T22:22:27+05:30 IST
టెట్ తప్పనిసరి చేసింది ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, ఎయిడెడ్లో కొత్తగా చేరేవారికి మాత్రమేనని విద్యాశాఖ అధికారులు తెలిపారని ఏపీ
అమరావతి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): టెట్ తప్పనిసరి చేసింది ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, ఎయిడెడ్లో కొత్తగా చేరేవారికి మాత్రమేనని విద్యాశాఖ అధికారులు తెలిపారని ఏపీ టీచర్స్ గిల్డ్ ప్రతినిధులు ఎల్కే చిన్నప్ప, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ అధికారులను కలిసి చర్చించగా ఈ మేరకు స్పష్టత నిచ్చారన్నారు.