గురిపెట్టారు
ABN , First Publish Date - 2021-10-26T07:40:50+05:30 IST
తిరుపతిలో సోమవారం ఏర్పాటుచేసిన పోలీసు ఆయుధాల ప్రదర్శన ఆకట్టుకుంది.
తిరుపతిలో సోమవారం ఏర్పాటుచేసిన పోలీసు ఆయుధాల ప్రదర్శన ఆకట్టుకుంది. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ముత్యాల రెడ్డి పల్లె పోలీస్ పరేడ్ మైదానంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. పలు పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులు ఆసక్తిగా ఆయుధాలను పరిశీలించారు. వాటి సాంకేతికత, పనితీరు, సామర్థ్యం అడిగి తెలుసుకున్నారు.ఎస్పీ వెంకటప్పలనాయుడు,ఏఎస్పీ సుప్రజ తదితరులు ఆయుధాల గురించి విద్యార్థులకు వివరించారు.డీఎస్పీలు నరసప్ప, నందకిషోర్,లక్ష్మణ్కుమార్, ఆర్ఐలు రెడ్డెప్పరెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- తిరుపతి
(నేరవిభాగం)