మహిళల అభ్యున్నతే లక్ష్యం : ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-04-24T04:28:00+05:30 IST

మహిళా అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు.

మహిళల అభ్యున్నతే లక్ష్యం : ఎమ్మెల్సీ
లబ్ధిదారులకు మెగాచెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి

బద్వేలు, ఏప్రిల్‌ 23: మహిళా అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. స్థానిక రాచపూడి నాగభూషణ కళాశాల ఆవరణలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారం భించిన ఆయన మాట్లాడుతూ అక్క, చెల్లెమ్మలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. డ్వా క్రా మహిళలు ఈపథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొం దాలన్నారు. 

 కార్యక్రమంలో ఏపీ సగర కార్పొరేషన చైర్‌ప ర్సన గానుగపెంట రమణమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన వాక మళ్ల రాజగోపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన గోపాల స్వామి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన రమణా రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

మైదుకూరులో....

మైదుకూరు, ఏప్రిల్‌ 23: నియోజ కవర్గంలో 5302 స్వయం సహాయ క గ్రూపులకు రూ. 847.39 కోట్ల వారి ఖాతాల్లో పడుతుందని ఎ మ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం స్థానిక వెలుగు స్త్రీశక్తి భవన్‌లో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ఆయన ప్రారంభిం చారు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్ర సారాన్ని  చూసిన అనంతరం మె గా చెక్కును విడుదల చేశారు. కార్యక్రమం లో ఛైర్మన్‌ మాచనూరు చంద్ర, వైసీపీ పట్ట ణ అధ్యక్షుడు లింగన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:28:00+05:30 IST