రూ. 900 లకే... విమానప్రయాణం
ABN , First Publish Date - 2021-08-05T00:26:50+05:30 IST
తన పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ‘ఇండిగో ఎయిర్లైన్స్’... ప్రత్యేకంగా ఓ సేల్ను నిర్వహిస్తోంది.
ముంబై : తన పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ‘ఇండిగో ఎయిర్లైన్స్’... ప్రత్యేకంగా ఓ సేల్ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రూ. 915 ప్రారంభ ధరకే టిక్కెట్ను పొందవచ్చు. ఈ రోజు(ఆగస్టు 4, బుధవారం)నుంచే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్... మరో రెండు రోజులపాటు(ఆరవ తేదీ వరకు) అమల్లో ఉంటుంది. ట్విట్టర్ వేదికగా ఇండిగో ఈ వివరాలను వెల్లడించింది. ఆఫర్లో భాగంగా ప్రయాణికులు కేవలం రూ. 915 ప్రారంభ ధరతో టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ ఆఫర్లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబరు ఒకటి నుంచి 2022 మార్చి 26 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. అదే హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు కలిగిన వారికి అదనంగా మరో 5 శాతం క్యాష్బ్యాక్ వెసులుబాటు ఉంటుంది. అయితే... కనీసం రూ. 3 వేల విలువైన లావాదేవీని నిర్వహించాల్సి ఉంటుంది.