ఎయిర్ఫోర్స్ స్టేషన్ను సందర్శించిన ట్రైనింగ్ కమాండ్ చీఫ్
ABN , First Publish Date - 2022-04-29T15:40:26+05:30 IST
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ తాంబరంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను సందర్శించారు. ఈ నెల
అడయార్(చెన్నై): ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ తాంబరంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ను సందర్శించారు. ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు ఆయన ఈ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చెందిన ఎయిర్ వారియర్స్ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ మానవేందర్ సింగ్ ఎయిర్ వారియర్స్, స్టేషన్ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించి, వారిని అభినందించారు.