Airportలో రూ.2 కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం
ABN , First Publish Date - 2022-06-18T13:33:31+05:30 IST
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి విమానాశ్రయంలో రూ.2 కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం దుబాయ్,
చెన్నై, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి విమానాశ్రయంలో రూ.2 కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం దుబాయ్, సింగపూర్ల నుంచి తిరుచ్చి వచ్చిన 30 మంది విమాన ప్రయాణికుల వద్ద తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు.. భారీగా అక్రమ బంగారాన్ని కనుగొన్నారు. వారి వద్ద నుంచి నాలుగు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ బంగారం విలువ రూ.4 కోట్లుగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారం స్మగ్లింగ్కు పాల్పడిన ప్రయాణికులపై కేసులు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.