కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి
ABN , First Publish Date - 2021-04-21T05:22:10+05:30 IST
పర్మినెంట్, ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి మంగళవారం కోరారు.
గుంటూరు(కార్పొరేషన్), ఏప్రిల్ 20: పర్మినెంట్, ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి మంగళవారం కోరారు. ఈ మేరకు మంగళవారం మేయర్ శివనాగ మనోహర్ నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె, యూనిఫాం, కుట్టుకూలీ, టవల్స్ వెంటనే ఇప్పించాలన్నారు. విద్యార్హత కలిగిన కార్మికులను శానిటరీ మేస్ర్తీలుగా పదోన్నతులు కల్పించాల కోరారు.