కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలి

ABN , First Publish Date - 2021-10-27T06:09:30+05:30 IST

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు నాలుగు నెలలుగా ఆపిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు ఎం.సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలి

విజయవాడ సిటీ : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు నాలుగు నెలలుగా ఆపిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు ఎం.సాంబశివరావు డిమాండ్‌ చేశారు. శ్రామిక మహిళా సంఘం ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సమావేశం ఏఐటీయూసీ నగర కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు జీవో 549 ప్రకారం రూ.16వేల వేతనం చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.9వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఎం.సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాతయ్య, ఎం.లక్ష్మీకుమారి, లీలావతి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T06:09:30+05:30 IST