ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఏకే శర్మ

ABN , First Publish Date - 2021-06-20T05:05:06+05:30 IST

మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ ఏకే శర్మను యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర బీజేపీ విభాగం ఇవాళ నిర్ణయం తీసుకుంది.

ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఏకే శర్మ

లక్నో: మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ ఏకే శర్మను యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర బీజేపీ విభాగం ఇవాళ నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. లక్నోకి చెందిన అర్చన మిశ్రా, బులంద్షహర్‌కు చెందిన అమిత్ వాల్మీకీలను రాష్ట్ర బీజేపీ సెక్రటరీలుగా నియమించినట్టు సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా ఏకే శర్మకు గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఆయనను పార్టీ ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించడం గమనార్హం.

Updated Date - 2021-06-20T05:05:06+05:30 IST