మూడో రోజు పీఎస్కు అఖిలప్రియ..ఇవ్వాల్టి విచారణ కీలకం
ABN , First Publish Date - 2021-01-13T17:09:44+05:30 IST
బోయినపల్లి కిడ్నాప్ కేసులో కస్టడీలో ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు..
హైదరాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో కస్టడీలో ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు మూడో రోజూ విచారిస్తున్నారు. ఇవ్వాల్టి విచారణ కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. అఖిలప్రియను బుధవారం ఉదయం బేగంపెట్ మహిళా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీల బృందం కలిసి కిడ్నాపర్లతో అఖిల ప్రియ మాట్లాడిన కాల్స్పై ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న గుంటూరు సీను, భార్గవ్రామ్ ఎక్కడ ఉన్నారనే దానిపై అఖిల ప్రియను ప్రశ్నిస్తున్నారు. టవర్ లోకేషన్, సిమ్ కార్డ్ నంబర్స్, ఇతర ఆధారాలను అఖిలప్రియ ముందుంచి ప్రశ్నిస్తున్నారు.
కాగా అఖిలప్రియ భర్త భార్గవరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. ప్రవీణ్కుమార్, అతడి సోదరుల కిడ్నాప్లో సూత్రధారులు, పాత్రధారుల వివరాలను అతడి నుంచి రాబడుతున్నట్లు సమాచారం.