రోడ్డుపై గాయపడిన యువకుడిని కాపాడిన మాజీ సీఎం!

ABN , First Publish Date - 2021-02-15T15:55:42+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్...

రోడ్డుపై గాయపడిన యువకుడిని కాపాడిన మాజీ సీఎం!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకున్న అఖిలేష్ యాదవ్... ఎయిర్‌పోర్టు నుంచి కారులో తన ఇంటికి బయలుదేరారు. అర్జున్‌గంజ్ మీదుగా వెళుతున్న సమయంలో రోడ్డుపై గాయాలతో బాధపడుతున్న ఒక యువకుడిని అఖిలేష్ గమనించారు. 


వెంటనే తన వాహనాన్ని ఆపించి, కారులో నుంచి కిందకు దిగి, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతనిని రోడ్డు పక్కనున్న గట్టుపై కూర్చోబెట్టారు. అతని యోగక్షేమాలు తెలుసుకుని, వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా బైక్‌పై వెళుతున్న ఆ యువకుడిని వెనుక నుంచి ఒక వాహనం ఢీకొన్నదని తెలుస్తోంది. ఫలితంగా అతను రోడ్డుపై పడిపోయాడు. ఈ ఉదంతాన్ని ఎస్పీ జాతీయ కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ ఒక ట్వీట్‌లో తెలియజేస్తూ ‘అఖిలేష్ యాదవ్ మరోమారు మానవత్వాన్ని చాటారు. రోడ్డుపై గాయాలతో బాధపడుతున్న ఒక యువకుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-15T15:55:42+05:30 IST