టీడీపీ హయాంలో పాలన పండగలా ఉంది: ఆలపాటి
ABN , First Publish Date - 2022-02-15T21:14:23+05:30 IST
టీడీపీ హయాంలో పరిపాలన పండగలా ఉందని ఆ పార్టీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
అమరావతి: టీడీపీ హయాంలో పరిపాలన పండగలా ఉందని ఆ పార్టీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లుగా సీఎం జగన్ వ్యవసాయంపై సమీక్షలు జరపలేదని విమర్శించారు. వ్యవసాయం బాగుందని ప్రచారాలు చేసుకుంటున్నారని, రైతు భరోసా కేంద్రాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేని గ్రామం లేదని, ఈ-క్రాప్తో 60 శాతం రైతులకే న్యాయం చేస్తామనడం అన్యాయమని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.