అప్రమత్తతే రక్షణ: ఆర్డీవో శీనానాయక్
ABN , First Publish Date - 2021-05-07T05:18:55+05:30 IST
కొవిడ్-19 పట్ల అప్రమత్తంగా ఉండాలని అదే మనకు రక్షణని రంపచోడవరం ఆర్డీవో శీనానాయక్ అన్నారు.
మారేడుమిల్లి, మే 6: కొవిడ్-19 పట్ల అప్రమత్తంగా ఉండాలని అదే మనకు రక్షణని రంపచోడవరం ఆర్డీవో శీనానాయక్ అన్నారు. గురువారం మండలంలోని బోదులూరు పీహెచ్సీ కోవిడ్ టెస్టింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. టెస్ట్ల వివరాలు, పాజిటీవ్ కేసులపై ఆరా తీశారు. మండలంలో చట్లవాడ పంచాయితీలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పంచాయితీలో పూర్తి లాక్డౌన్ దిశగా చర్యలు చేపట్టాలని మండల తహశీల్దార్ ఎంపీడీవోలను ఆదేశించారు. అలాగే మారేడుమిల్లిలో హోమ్ ఐసోలేషన్లో ఉన్నా బాధితులను పరామర్శించి, ఏఎన్ఎం, హెల్త్ వాలంటీర్ సకాలంలో వైద్య సేవలు అందిస్తు తీరును అడిగి తెలుసుకున్నారు.