కరోనాతో విదేశీయుడి మృతి
ABN , First Publish Date - 2021-05-09T06:11:09+05:30 IST
కరోనా బారినపడి పుట్టపర్తి కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతూ ఇటలీకి చెందిన వ్యక్తి(55) శనివారం మృతిచెందినట్టు అర్బన సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు.
పుట్టపర్తి, మే 8: కరోనా బారినపడి పుట్టపర్తి కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతూ ఇటలీకి చెందిన వ్యక్తి(55) శనివారం మృతిచెందినట్టు అర్బన సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. కరోనా పాజిటివ్ రావడంతో ఐదు రోజులుగా సూపర్ఆస్పత్రి వద్ద ఉన్న కొవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపఽథ్యంలో చికిత్స పొందుతూ మృతిచెందారన్నా రు. ఎనుములపల్లికి చెందినవ్యక్తి అనంతపురంలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఇటీ వల రోజు కరోనా మరణాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
హెడ్కానిస్టేబుల్..
ధర్మవరంఅర్బన: అర్బన పోలీస్స్టేషనలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా హెడ్కాని స్టేబుల్ నాగమణి(45) కరోనాతో శనివారం మృతిచెందారు. ఈమె ధర్మవరంలో విధులు నిర్వర్తిస్తూ అనంతపురంలో నివాసం ఉంటోంది. అయితే నాలుగు రోజులక్రితం పాజిటివ్ రావడంతో బత్తలపల్లి ఆర్డీటీ కొవిడ్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యసిబ్బంది తెలిపారు.