రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-05-21T03:36:27+05:30 IST

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ప్రతీ రైతు ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన అన్నారు. శుక్రవా రం రాంపూర్‌, భీమిని, కేస్లాపూర్‌ గ్రామాల్లోని రైతువేదికల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. రైతులు పచ్చిరొట్ట ఎరువులు తప్పనిసరిగా వాడాలని, లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు దగ్గర ఉంచుకోవాలన్నారు.

రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలి
భీమిని రైతువేదిక వద్ద మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన

భీమిని, మే 20 : పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ప్రతీ రైతు ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన అన్నారు. శుక్రవా రం రాంపూర్‌, భీమిని, కేస్లాపూర్‌ గ్రామాల్లోని రైతువేదికల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. రైతులు పచ్చిరొట్ట ఎరువులు తప్పనిసరిగా వాడాలని, లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు దగ్గర ఉంచుకోవాలన్నారు. వానాకాలంలో పత్తి, కంది పంటల సాగును పెంచాలని సూచించారు. మండల కేంద్రంలోని నరేష్‌ ఫెర్టిలైజర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో స్టాక్‌ బుక్‌ రికార్డులు సక్రమంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, విత్తనాలు అమ్మినట్లయి తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీఏ ఇంతియాజ్‌హైమ్మద్‌, ఏఓ టెక్ని కల్‌ శ్రీనివాస్‌, ఏఈఓలు అఫ్రోజ్‌, మనీషా, సర్పంచు ఎల్లాగౌడ్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T03:36:27+05:30 IST