ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలి: అఖిలపక్ష నేతలు
ABN , First Publish Date - 2021-05-09T23:14:45+05:30 IST
ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.
అమరావతి: ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలపై అఖిలపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు పలు తీర్మానాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఆక్సిజన్ సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా బాధితులకు తక్షణ సాయం కింద.. రూ.10వేలు చొప్పున 6 నెలలు అందించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని తెలిపారు. సీఎం జగన్ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు కోరారు.