వైసీపీ పాలనలో అన్నీ కోతలు.. వాతలే..!

ABN , First Publish Date - 2022-05-22T06:33:12+05:30 IST

వైసీపీ పాల నలో సాధించిన ప్రగతి ఏమిటో ప్రజ లంతా ఇప్పటికే తెలుసున్నారని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానా యుడు ఎద్దేవా చేశారు.

వైసీపీ పాలనలో అన్నీ కోతలు.. వాతలే..!
విలేఖర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, టీడీపీ శ్రేణులు


  మాజీ ఎమ్మెల్యే ‘గవిరెడ్డి’

చీడికాడ, మే 21 : వైసీపీ పాల నలో సాధించిన ప్రగతి ఏమిటో ప్రజ లంతా ఇప్పటికే తెలుసున్నారని  మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానా యుడు ఎద్దేవా చేశారు. ఈ మూడేళ్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజ లపై భారాలు తప్ప, చేపట్టిన అభివృద్ధి పనులు శూన్యమన్నారు. మండలం లోని అప్పలరాజుపురం టీడీపీ కార్యాల యంలో శనివారం విలేఖర్ల సమావే శంలో మాట్లాడారు.  అమ్మఒడి, రైతు భరోసా, రేషన్‌ కార్డులు, పింఛన్లు తదితరాల్లో కోతలు పెడుతూ ఆయా లబ్ధిదారులను మానసిక ఆందోళనకు జగన్‌ గురిచేస్తున్నారన్నారు. మరోపక్క పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, చెత్తపై పన్ను ఇలా వివిధ రూపాల్లో సామాన్య, మధ్య తరగతిపై మోయలేని భారాలు మోపుతు న్నారన్నారు. వీటన్నింటినీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజానీకం రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్య మంత్రిని చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుకో వాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతల చిన్నంనాయుడు, బొబ్బాది తాతారావు, మాజీ ఎంపీపీ పోతల రమణమ్మ,   నాయకులు పైల ముత్యాలనాయుడు, గౌరీపట్నపు నానాజీ, వేపాడ నాగేశ్వ రరావు, గాడి ప్రసాద్‌, గణేశ్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T06:33:12+05:30 IST