వెలిగొండ పాదయాత్రకు అనుమతివ్వండి

ABN , First Publish Date - 2021-10-27T07:31:35+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు కోసం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఎస్పీ మలిక గర్గ్‌ను మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నాయకత్వంలో నాయకులు కలిశారు.

వెలిగొండ పాదయాత్రకు అనుమతివ్వండి
ఎస్పీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న టీడీపీ నేతలు

ఎస్పీని కోరిన టీడీపీ నేతలు

ఒంగోలు (క్రైం), అక్టోబరు 26 : వెలిగొండ ప్రాజెక్టు కోసం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఎస్పీ మలిక గర్గ్‌ను మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నాయకత్వంలో నాయకులు కలిశారు. రూట్‌మ్యాపుతోపాటు సమగ్రంగా వినతిపత్రాన్ని అందిస్తే పరిశీలిస్తానని ఎస్పీ వారికి స్పష్టం చేశారు. అంతేకాకుండా జిల్లాలో జరుగుతున్న అధికారపార్టీ దారుణాలను మలికగర్గ్‌కు టీడీపీ నాయకులు వివరించారు. ఎస్పీని కలిసిన వారిలో దర్శి, వైపాలెం ఇన్‌చార్జులు పమిడి రమేష్‌, గూడూరి ఎరిక్షన్‌బాబు, పార్టీ ఒంగోలు పార్లమెంటరీ స్థానం అధ్యక్షుడు నూకసాని బాలాజీ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-10-27T07:31:35+05:30 IST