కారుణ్య మరణానికి అనుమతించండి: ఓ తల్లి ఆవేదన

ABN , First Publish Date - 2022-07-07T22:06:22+05:30 IST

కాకినాడ: తల్లి బాగోగులు చూడాల్సిన కన్నకొడుకు, కోడలు కఠినంగా వ్యవహరించారు. మనోవేదనకు గురైన ఆ తల్లి తనయుడి తీరును అధికారులు దృష్టికి తీసుకెళ్లానా ఫలితం లేకపోయింది. తీవ్రం మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తి

కారుణ్య మరణానికి అనుమతించండి: ఓ తల్లి ఆవేదన

కాకినాడ: తల్లి బాగోగులు చూడాల్సిన కన్నకొడుకు, కోడలు కఠినంగా వ్యవహరించారు. మనోవేదనకు గురైన ఆ తల్లి తనయుడి తీరును అధికారుల దృష్టికి తీసుకెళ్లానా ఫలితం లేకపోయింది. తీవ్రం మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తి తనను కారుణ్య మరణానికి అనుమతించాలని పోలీసు సూపరింటెండెంట్‌కు మొరపెట్టుకుంది. ఈ హృదయ విదారక ఘటన కాకినాడ రూరల్ పరిధిలో జరిగింది. గైగోలపాడుకు చెందిన అచ్చియ్యమ్మను ఇటీవల తన చిన్నకొడుకు, కోడలు ఇంట్లో నుంచి గంటేశారు. దీంతో ఆమె విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పట్టించుకోకపోవడంతో కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు వినతి పత్రం అందజేశారు. తన బాధను ఆయనకు వివరించింది. చనిపోవాలని నిర్ణయించుకున్నానని, తనను కారుణ్య మరణానికి అనుమతించాలని ఎస్పీని కోరారు.

Updated Date - 2022-07-07T22:06:22+05:30 IST