తొలి టెస్టు: శతకం బాదిన జడ్డూ..
ABN , First Publish Date - 2022-03-05T17:14:04+05:30 IST
శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 161 బంతుల్లో 10 ఫోర్లతో 101 రన్స్ చేసి శతకం బాదాడు. జడేజాకు తొడుగా అశ్విన్
మొహాలి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 160 బంతుల్లో 10 ఫోర్లతో శతకం బాదాడు.తన కెరీర్ లో జడేజా రెండో టెస్టు సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. అయితే..జడేజాకు తొడుగా అశ్విన్ నిలిచాడు. 61 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్ 110వ ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అశ్విన్ ఔటైన తర్వాత 111వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి జడేజా తన శతకాన్ని పూర్తి చేశాడు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 357/6తో భారత్ జట్టు ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రవీంద్ర జడేజా, అశ్విన్ నిలకడగా ఆడి 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ జట్టు 400 స్కోర్ మార్క్ను ధాటింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 112 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లకు 467గా ఉంది. క్రీజులో జడేజా(102), జయంత్ యాదవ్(02) కొనసాగుతున్నారు.