విద్యతో పాటు ఉన్నతోద్యోగమే అంతిమ లక్ష్యం
ABN , First Publish Date - 2022-08-12T18:28:16+05:30 IST
చదవటమే కాదు.. నేర్చుకున్న విజ్ఞానంతో మంచి ఉద్యోగం సాధించటమే అంతిమ లక్ష్యం కావాలని విజ్ఞాన్ విద్యా సంస్థల(Science Education Institutions) చైర్మన్ డాక్టర్
విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
గుంటూరు, ఆగస్టు 11: చదవటమే కాదు.. నేర్చుకున్న విజ్ఞానంతో మంచి ఉద్యోగం సాధించటమే అంతిమ లక్ష్యం కావాలని విజ్ఞాన్ విద్యా సంస్థల(Science Education Institutions) చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ వర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. రత్తయ్య(Rattaiah) ప్రసంగిస్తూ.. నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఎన్ఈపీ-2020ను అమలు చేస్తున్నామన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సాధించేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు.