పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , First Publish Date - 2022-05-16T05:03:44+05:30 IST

మండలంలోని యర్రగుంట్ల ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో 2001-02లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఆర్థిక సాయం అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

శిరివెళ్ల, మే 15: మండలంలోని యర్రగుంట్ల ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో 2001-02లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులంతా ఆత్మీయంగా అలనాటి జ్ఙాపకాలను నెమరువేసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఇటీవల అకాల మరణం చెందిన స్నేహితుడు హుసేన్‌ బాషా కుటుంబానికి రూ.1.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

Updated Date - 2022-05-16T05:03:44+05:30 IST