నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-11-29T05:32:07+05:30 IST
నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి డిమాండ్ చేశారు.
- టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి
ఆలూరు రూరల్, నవంబరు 28: నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నివర్ తుఫాను వల్ల వరి, వాము, మిరప, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. హాలహర్వి, హొళగుంద మండల కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ భీమలింగప్పచౌదరి, నాయకులు కర్రెన్న, విశ్వతేజ్, కల్యాణ్బాబు, సూరిబాబు, రమేష్, హరి పాల్గొన్నారు.