ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గంలో ఆమనగల్లుకు అగ్రస్థానం

ABN , First Publish Date - 2021-03-01T04:45:43+05:30 IST

ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గంలో ఆమనగల్లుకు అగ్రస్థానం

ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గంలో ఆమనగల్లుకు అగ్రస్థానం

ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో ఆమనగల్లు పట్టణానికి పెద్దపీట వేశారు. 8 మందికి జిల్లా కమిటీలో చోటుకల్పించారు. ఆదివారం హైదరాబాద్‌ బొబ్బిలి దామోద్‌రెడ్డి గార్డెన్‌లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మహాసభ జిల్లా ఉపాధ్యక్షులుగా వీరబొమ్మ రామ్మోహన్‌, మండెం చంద్రశేఖర్‌, సహాయ కార్యదర్శులుగా కండె పాండు రంగయ్య, కొరివి వెంకటయ్య, మేడిశెట్టి శ్రీధర్‌, బికుమాండ్ల నర్సింహ, కార్యవర్గ సభ్యులుగా విడియాల రవి, జనుంపల్లి నర్సింహ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా కమిటీలో చోటు లభించిన సంఘం నాయకులకు ఆమనగల్లు మండల నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. 


Updated Date - 2021-03-01T04:45:43+05:30 IST