మణిమేశ్వరంలో అమరనాథ్కు నివాళి
ABN , First Publish Date - 2021-04-22T07:00:36+05:30 IST
సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యుడు కోసూరు అమర్నాథ్ మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అని పలువురు వక్తలు పేర్కొన్నారు.
బంటుమిల్లి, ఏప్రిల్ 21 : సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యుడు కోసూరు అమర్నాథ్ మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. మణిమేశ్వరం గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. స్థానిక ప్రముఖులు మాట్లాడుతూ, అమరనాథ్ తూర్పుగోదావరి జిల్లా మావుడూరులో పుట్టినప్ప టికీ ఆయన మణిమేశ్వరంలో కొంతకాలం నివశించారన్నారు. ప్రతి ఏగా సంక్రాంతి పండుగకు మణిమేశ్వరం వచ్చి బంధువులతో, స్నేహితులతో ఉల్లాసంగా గడిపేవారని ఆయన సోదరులు సత్యనారాయణరాజు తెలిపారు. మాజీ సర్పంచ్ దింటకుర్తి మధుసూధనరావు, వైసీపీ మండల పార్టీ కన్వీనర్ మలిశెట్టి రాజబాబు, ఉపసర్పంచ్ దింటకుర్తి శ్రీనివాసరావు, సుబ్బరాజు, నరసింహరాజు, బాసిరాజు, కేశవరాజు, ఆకుల సుబ్బారావు, కటకం నాగేశ్వ రరావు, ఆళ్ల నాగరాజు, ఎన్.వి.వి.ఎస్.ప్రసాద్, గ్రామస్థులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.