287వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-29T12:00:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 287వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి పరిధిలోని మందడం,

287వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 287వ రోజుకు చేరాయి. రాజధాని అమరావతి పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం ఐనవోలు, ఉద్దండరాయని పాలెం, పెడపరిమి, దొండపాడు, నేలపాడు, ఆనంతవరం, నీరుకొండ తదితర గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు తమ నిరసనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కాగా, రాజధాని తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయంపై కేంద్రం కల్పించుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - 2020-09-29T12:00:13+05:30 IST