Tulasireddy: మళ్లీ బీజేపీ పాదయాత్ర ఎందుకు?

ABN , First Publish Date - 2022-08-01T01:54:30+05:30 IST

అమరావతి (Amaravathi) రాజధాని విషయంలో బీజేపీ (Bjp) కపటనాటకమాడుతోందని...

Tulasireddy: మళ్లీ బీజేపీ పాదయాత్ర ఎందుకు?

గుంటూరు (Guntur): అమరావతి (Amaravathi) రాజధాని విషయంలో బీజేపీ (Bjp) కపటనాటకమాడుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి (Pcc Working President Tulasi Reddy) అన్నారు. రాజధాని కోసం బీజేపీ నేతలు చేస్తున్న పాదయాత్రపై ఆయన సెటైర్లు వేశారు. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ రెండు నాలుకల ధోరణితో ఉందన్నారు. రాజధాని ఏర్పాటు ఏపీ ప్రభుత్వం (Ap Government) ఇష్టమని చెప్పి ‘మన అమరావతి’ అని పాదయాత్ర చేపట్టడమేంటోనని ఎద్దేవా చేశారు. రాజధానిపై బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం(Central Government)తో అఫిడవిట్ ఇప్పించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాజధానికి కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. మ్యాప్‌లో కూడా పెట్టారని.. మళ్ళీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ (Jagan)కు నరేంద్ర మోదీ (Narendra Modi), అమిత్ షా (Amith Shah) అంటే భయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధాని అని అఫిడవిట్ ఇస్తే కాంగ్రెస్ తరఫున తాము కూడా స్వాగతిస్తామని తులసిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-08-01T01:54:30+05:30 IST