Ap High Court: అమరావతి అభివృద్ధిపై తీర్పు అమలుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-08-23T04:08:31+05:30 IST

రాజధాని అమరావతి (Amaravathi)పై త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలుకు సంబంధించి మంగళవారం హైకోర్టు (High Court)లో విచారణ జరగనుంది. తీర్పును..

Ap High Court: అమరావతి అభివృద్ధిపై తీర్పు అమలుపై హైకోర్టులో విచారణ

అమరావతి: రాజధాని అమరావతి (Amaravathi)పై త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలుకు సంబంధించి మంగళవారం హైకోర్టు (High Court)లో విచారణ జరగనుంది. అమరావతిని అభివృద్ధి చేయాలని గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ప్రభుత్వంపై రాజధాని రైతులు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆదేశించిన విధంగా ఆరు నెలల్లో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదని ప్రభుత్వం ఆఫిడవిట్ దాఖలు చేసింది. 60 నెలలు సమయం కావాలని కోరింది.  అయితే ఇరు పక్షాల పిటిషన్లపై మంగళవారం ఉదయం 10:30కు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఇప్పటికే రాజధాని రైతులు సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ పిటిషన్లు వేశారు.

Updated Date - 2022-08-23T04:08:31+05:30 IST