రాయలసీమ MLC అభ్యర్ధుల ఎన్నికల బరిలో CPS ఉద్యోగుల సంఘం
ABN , First Publish Date - 2022-06-27T20:51:21+05:30 IST
రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికల బరిలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం పోటీ చేయనుంది.
అమరావతి (Amaravathi): రాయలసీమ ఎమ్మెల్సీ (MLC) అభ్యర్ధుల ఎన్నికల బరిలో సీపీఎస్ (CPS) ఉద్యోగుల సంఘం పోటీ చేయనుంది. ఈ సందర్బంగా సీపీఎస్ యూనియన్ నేతలు దాస్ (Das), రవి కుమార్ (Ravi kumar) మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేయనందుకు నిరసనగా పోటీలో ఉంటామని ప్రకటించారు. రానున్న ఉపాధ్యాయ, గ్రాడ్యువేట్ ఎన్నికల్లో పోటీ పెడతామని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ (Jagan).. ప్రజల ముందు 120 సార్లు హామీ ఇచ్చి.. మాట తప్పారన్నారు. కమిటీల పేరుతో సీపీఎస్ ఉద్యోగులను వంచన, మోసానికి గురి చేశారన్నారు. తమ అభ్యర్ధులకు మద్దతు ఇవ్వాలని ఫ్యాప్టో, జేఏసీలను కూడా కోరుతామని యూనియన్ నేతలు అన్నారు.