వాళ్లను శిక్షించాల్సిందే: Lokesh

ABN , First Publish Date - 2022-07-03T02:40:59+05:30 IST

పుంగనూరు మండలం కల్లూరుకు చెందిన టీడీపీ నేత శివకుమార్‌ (Tdp Leader Sivakumar)పై వైసీపీ ...

వాళ్లను శిక్షించాల్సిందే: Lokesh


అమరావతి (Amaravathi): పుంగనూరు మండలం కల్లూరుకు చెందిన టీడీపీ నేత శివకుమార్‌ (Tdp Leader Sivakumar)పై వైసీపీ (Ycp) కార్యకర్తల దాడిని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేశ్ (Nara lokesh) ఖండించారు. మరో టీడీపీ నేత రాజారెడ్డి (RaJareddy)ని వైసీపీ కార్యకర్తలు హత్య చేయడానికి యత్నించారని ఆయన ఆరోపించారు. వైసీపీ వాళ్లు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. నాడు రాజారెడ్డి, నేడు శివకుమార్ (Sivakumar)..రేపు ఇంకెవరు అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ప్రతి చర్యకు దిగితే పరిణామాలకు బాధ్యత పోలీసులది కాదా? అని నిలదీశారు. తక్షణమే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని లోకేష్‌ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-07-03T02:40:59+05:30 IST