అమరావతిని కాదంటే.. అభాసుపాలే

ABN , First Publish Date - 2020-12-01T14:59:54+05:30 IST

అమరావతిని రాజధానిగా కాదంటున్న..

అమరావతిని కాదంటే.. అభాసుపాలే

349వ రోజూ కొనసాగిన రైతుల దీక్షలు


తుళ్లూరు(కృష్ణా): అమరావతిని రాజధానిగా కాదంటున్న పాలకులు అభాసుపాలవుతున్నారని రైతులు, మహిళలు వ్యాఖ్యానించారు. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని రైతులు చేస్తున్న ఉద్యమం సోమవారం 349వ రోజుకు చేరుకుంది. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి సందర్భంగా అమరావతిని రక్షించాలని నెక్కల్లు, మందడం, తుళ్లూరు రైతు శిబిరాల్లో శివుడికి పూజలు నిర్వహించారు. లింగారంలో దీపాలు వెలిగించి నిరసనలు తెలిపారు. కాగా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో ఆందోళన శిబిరాల వద్ద పోలీసులు మోహరించారు. 

Updated Date - 2020-12-01T14:59:54+05:30 IST